అక్షరటుడే, న్యూఢిల్లీ: Covid virus : దేశంలో కొవిడ్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. హాంకాంగ్(Hong Kong), సింగపూర్(Singapore) తర్వాత భారత్(Bharath)(India)లోనూ కొవిడ్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్ బారిన పడినవారి సంఖ్య 1,009కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 752 కేసులు నమోదైనట్లు పేర్కొంది.
అత్యధిక కొవిడ్ కేసులు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళ(Kerala)లో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి చేరింది. గత 24 గంటల్లో అక్కడ 335 కొత్త కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
Covid virus : దేశ రాజధానిలోనూ..
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇక్కడ క్రియాశీల కేసులు 104 ఉన్నాయి. వారం రోజుల్లో ఢిల్లీలో 99 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో 153 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ యాక్టివ్ కరోనా కేసులు సోమవారం నాటికి 209కు చేరుకున్నాయి.
గుజరాత్(Gujarat)లో 83, కర్ణాటక(Karnataka)లో 47, ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో 15, పశ్చిమబెంగాల్(West Bengal)లో 12 నమోదయ్యాయి. కాగా, థానె(Thane)లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ కల్వా ఆస్పత్రి(Chhatrapati Shivaji Maharaj Kalwa Hospital)లో కొవిడ్తో 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
Covid virus : కొత్త వేరియంట్లు..
తాజాగా కొవిడ్ సోకిన వారిని విశ్లేషించగా.. రెండు కొత్త వేరియంట్లు(new variants) NB.1.8.1, LF.7 ప్రబలుతున్నట్లు గుర్తించారు. ఈ రెండు కొత్త వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సైతం స్పందించింది. ఈ రెండు కొత్త వేరియంట్లు కూడా తమ పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించింది.