More
    HomeజాతీయంKarnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    Karnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | కర్ణాటక – కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara Wildlife Division)లో వన్యప్రాణి ప్రేమికులను కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఒక తల్లి పులి, నాలుగు పిల్ల‌లు విషప్రయోగం(Poisoning) కారణంగా మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకేరోజు ఐదు పులులు మరణించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్పుకొచ్చారు. అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన పులులకు సమీపంలో ఒక ఆవు కళేబరం కనిపించింది. కొన్ని రోజుల క్రితం ఆ పులి ఆవును చంపినట్టు గుర్తించారు అధికారులు. అయితే స్థానిక గ్రామస్థులు ప్రతీకారంగా ఆవు మాంసంలో విషం కలిపి ఎర వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

    READ ALSO  Malaria Vaccine | మలేరియా వ్యాక్సిన్ ధర సగం తగ్గింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న భారత్ బయోటెక్

    Karnataka | మృతిపై అనుమానాలు

    మృతదేహాలపై శవ పరీక్ష నిర్వహించగా, విషపదార్థాల ప్రభావమే మృతికి కారణమని స్పష్టమైంది. ఫోరెన్సిక్ నివేదికను(Forensic Report) కూడా అనుసంధానించి, తుది నిర్ధారణకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే(Ishwar Khandre), “ఇది తీవ్రమైన ఘటన. మూడు రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయని అటవీ శాఖ(Forest Department) వెల్లడించింది. మధ్యప్రదేశ్ తర్వాత ఎక్కువగా పులులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. పులుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో పశువులపై దాడులు జరగడం, గ్రామస్థులు తమ పశువులను కాపాడుకునేందుకు వన్యప్రాణులపై విషప్రయోగానికి పాల్పడటం వంటి ఘటనలు వన్యప్రాణులకు ముప్పుగా మారుతున్నాయి.

    READ ALSO  Punjab CM | కేజ్రీవాల్‌కి బౌన్స‌ర్ మాదిరిగా పంజాబ్ ముఖ్య‌మంత్రి.. ఇదేం చోద్యం అంటున్న నెటిజ‌న్స్

    ఈ సంఘటన వన్యప్రాణుల (Wildlife animals) రక్షణ చర్యల్లో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. గ్రామస్థులు తమ పశుసంపదను కాపాడుకోవడానికి అడవి జంతువులపై ఇలాంటి విధమైన చర్యలకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం, అటవీ శాఖలు, స్థానిక ప్రజల మధ్య అవగాహన పెంచాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది. పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    Latest articles

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...

    Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే......

    More like this

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

    PJR Flyover | నగరవాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న పీజేఆర్ ఫ్లైఓవర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PJR Flyover | గచ్చిబౌలి నుంచి కొండాపూర్​ మార్గంలో నిర్మించిన ఫ్లై ఓవర్​ (Kondapur Flyover)...