Home తెలంగాణ Eetala Rajender | నోటీసులకు భయపడేది లేదు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

Eetala Rajender | నోటీసులకు భయపడేది లేదు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

0
Eetala Rajender | నోటీసులకు భయపడేది లేదు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Etala Rajender | మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్​ కాళేశ్వరం కమిషన్​ నోటీసులపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ డిజైన్​ మార్పు, నిర్మాణ సమయంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం జస్టిస్ ఘోష్​ కమిషన్​(Justice Ghosh Commission)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కమిషన్​ ఈఎన్​సీలు సహా కీలక ఇంజినిర్లు, అధికారులను విచారించింది. తాజాగా మాజీ సీఎం  కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు.

Etala Rajender | ఆర్థిక మంత్రిగా ఈటల

బీఆర్​ఎస్(BRS)​ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈటల రాజేందర్(Eetala Rajender)​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. హరీశ్​ రావు(Harish Rao) నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో అప్పటి సీఎం కేసీఆర్(KCR)​తో పాటు, ఈటల, హరీశ్​రావుకు కమిషన్​ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, 9న ఈటల రాజేందర్​ను విచారణకు హాజరు కావాలని సూచించింది.

Etala Rajender | విచారణకు సహకరిస్తా..

కాళేశ్వరం కమిషన్​ ఈటల రాజేందర్(Eetala Rajender)​ స్పందించారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేని, అందాక సమాధానం చెబుతానని తెలిపారు. చట్టాలు, కోర్టులు, కమిషన్‌పై నమ్మకం ఉందని, కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తనతో పాటు మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరికి కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. తాను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.

Exit mobile version