అక్షరటుడే, వెబ్డెస్క్ :Etala Rajender | మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మార్పు, నిర్మాణ సమయంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్(Justice Ghosh Commission)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కమిషన్ ఈఎన్సీలు సహా కీలక ఇంజినిర్లు, అధికారులను విచారించింది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్కు మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు.
Etala Rajender | ఆర్థిక మంత్రిగా ఈటల
బీఆర్ఎస్(BRS) మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈటల రాజేందర్(Eetala Rajender) ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. హరీశ్ రావు(Harish Rao) నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో అప్పటి సీఎం కేసీఆర్(KCR)తో పాటు, ఈటల, హరీశ్రావుకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, 9న ఈటల రాజేందర్ను విచారణకు హాజరు కావాలని సూచించింది.
Etala Rajender | విచారణకు సహకరిస్తా..
కాళేశ్వరం కమిషన్ ఈటల రాజేందర్(Eetala Rajender) స్పందించారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేని, అందాక సమాధానం చెబుతానని తెలిపారు. చట్టాలు, కోర్టులు, కమిషన్పై నమ్మకం ఉందని, కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తనతో పాటు మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరికి కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. తాను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్గా ఉన్నారని చెప్పారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.