అక్షరటుడే, వెబ్డెస్క్:Operation Kagar | తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ శివారులో గల కర్రెగుట్టల్లో karregutta operation సీఆర్పీఎఫ్ బలగాలు(CRPF Forces) చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar)కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు(Maoist in karregutta) ఉన్నారని వేల సంఖ్యలో కేంద్ర బలగాలు గుట్టలను ముట్టడించాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే పలు స్థావరాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు జవాన్లు కూడా మృతి చెందారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్(Operation Kagar)నే ఆపేయాలని బలగాలకు సూచించింది. సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం సాయంత్రంలోగా రిపోర్ట్ చేయాలని పేర్కొంది. భారత్ – పాక్(India – Pkistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.