అక్షరటుడే, వెబ్డెస్క్:Railway Passengers | తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువ మంది రైళ్లద్వారానే రాకపోకలు సాగిస్తారు. దీంతో బెంగళూరు(Bangalore) మార్గంలో నడిచే ట్రైన్లలో అధిక రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ ప్రయణికులకు(Railway Passengers) గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని గ్వాలియర్ నుంచి బెంగళూరుకు ప్రత్యేక రైలును గురువారం అధికారులు ప్రారంభించారు. ఈ రైలు గ్వాలియర్ నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్మీదుగా బెంగళూరులోని సర్ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్(Visvesvaraya Terminal)కు చేరుకుంటుంది. రెగ్యులర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలుగా ఈ 29 నుంచి రైలు అందుబాటులోకి రానుంది. బెంగళూరు నుంచి 29న రైలు ప్రారంభం కానుంది.
Railway Passengers | కేంద్ర మంత్రి చొరవతో..
కేంద్ర సమాచార శాఖ మంత్రి, గుణ బీజేపీ లోక్సభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా(MP Jyotiraditya Scindia) కృషితో ఈ రైలు మంజూరు అయింది. ఆయన నియోజకవర్గం పరిధిలోని మూడు ప్రముఖ స్టేషన్లలో ఈ ట్రెయిన్ ఆగుతుంది. ఉత్తర మధ్య రైల్వే జోన్ ఝాన్సీ డివిజన్(Jhansi Division) ఆధ్వర్యంలో దీనిని నడుపుతున్నారు. ఈ రైలు ప్రాథమిక నిర్వహణ గ్వాలియర్ కోచింగ్ డిపోలో నిర్వహిస్తారు.
Railway Passengers | తెలంగాణలో ఎక్కడ ఆగుతుందంటే..
గ్వాలియర్ – బెంగళూరు రైలు తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతుంది. దీంతో ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. గద్వాల, మహబూబ్ నగర్, కాచిగూడ, కాజీపేట, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో ఈ రైలుకు స్టాప్ సదుపాయం కల్పించారు. బెంగళూరు వెళ్లేటప్పుడు ఈ ట్రెయిన్ కాచిగూడ రైల్వే స్టేషన్(Kacheguda Railway Station) కి ప్రతి శనివారం 5:20 నిమిషాలకు వచ్చి 5:30 నిమిషాలకు బయలుదేరుతుంది. గ్వాలియర్ వెళ్లేటప్పుడు ప్రతి సోమవారం ఉదయం 03:25 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.