అక్షరటుడే, ఎల్లారెడ్డి:Minister Ponguleti | రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల్లో వీఆర్ఏ(VRA), వీఆర్వో(VRO) వ్యవస్థను తిరిగి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. ఎల్లారెడ్డిలోని షెట్పల్లిలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. భూభారతి(Bhubharati) చట్టంలో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలకు అధికారులను పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. 380 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, 6వేల సర్వేయర్ల పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Minister Ponguleti | ఎవరైనా తప్పుచేస్తే..
తహశీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు భూవివాదాలకు సంబంధించి ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా భూభారతి చట్టం రూపొందించబడి ఉందన్నారు. యువవికాసం(Yuva Vikasam) కింద ప్రతి నియొజకవర్గం నుంచి 3 వేల నుంచి 4వేల వరకు యువతకు సాయం చేసేలా ప్రణాళిక వేశామన్నారు. రాబోయే నాలుగేళ్లలో 20లక్షల ఇళ్లు కట్టించే విధంగా చూస్తామన్నారు. అర్హులైన పేదలు ప్రభుత్వ భూమి తరాల నుంచి సాగు చేసుకుంటుంటే.. వారికి చట్టబద్ధంగా పాస్బుక్లు ఇచ్చేవిధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.