Site icon aksharatoday.in

Yellareddy | విద్యుదాఘాతంతో ఒకరి మృతి

Yellareddy

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ తండాలో (Thimmapur Thanda) సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నేనావత్ రవి (32) తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి (Indiramma House) నిర్మాణ పనుల్లో భాగంగా నీరు పడుతుండగా, విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి (Yellareddy Government Hospital) తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

Exit mobile version