Home జిల్లాలు కామారెడ్డి Minister Ponnam Prabhakar | శాంతి చర్చలతోనే మావోయిస్టుల సమస్యకు పరిష్కారం

Minister Ponnam Prabhakar | శాంతి చర్చలతోనే మావోయిస్టుల సమస్యకు పరిష్కారం

0
Minister Ponnam Prabhakar | శాంతి చర్చలతోనే మవోయిస్టుల సమస్యకు పరిష్కారం

అక్షరటుడే, కామారెడ్డి: Minister Ponnam Prabhakar | శాంతి చర్చలతోనే మావోయిస్టుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో మృతి చెందిన పాల్వంచకు చెందిన వడ్ల శ్రీధర్ అంత్యక్రియలను ప్రభుత్వం(Government) అధికారికంగా నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. శ్రీధర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీధర్​ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు.

Minister Ponnam Prabhakar | మావోలపై కేంద్రం ఉక్కుపాదం..

మావోల ఏరివేతపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని, చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించిందని మంత్రి తెలిపారు. అయితే ప్రాణనష్టం జరగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. గతంలో మావోలతో తామే చర్చలు జరిపామని, నాడు చర్చల్లో పాల్గొన్న జానారెడ్డి(Janareddy), కేకే(KK)లకు ప్రస్తుతం బాధ్యతలు అప్పజెప్పామన్నారు. చర్చలకు తాము సిద్ధమని, కాల్పుల విరమణకు మావోయిస్టులు(Maoists) ప్రకటించారన్నారు. కానిస్టేబుల్​ శ్రీధర్(Constable Sridhar)​ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2.17 కోట్లతో పాటు 300 గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version