Home భక్తి Jagannath Rath Yatra | రథయాత్రలో భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. తప్పిన ప్రమాదం

Jagannath Rath Yatra | రథయాత్రలో భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. తప్పిన ప్రమాదం

0
Jagannath Rath Yatra
Jagannath Rath Yatra | రథయాత్రలో భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. తప్పిన ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరిలో శుక్రవారం జగన్నాథుడి రథయాత్రను వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు రథయాత్ర కోసం ఇప్పటికే పూరి చేరుకున్నారు. పూరితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైతం జగన్నాథుడి రథయాత్ర(Jagannath Rath Yatra) నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గుజరాత్​లోని అహ్మదాబాద్(Ahmedabad)​లో నిర్వహించిన రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. మూడు ఏనుగులు అదుపు తప్పి భక్తులపై దూసుకెళ్లాయి.

అహ్మదాబాద్‌లో ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మూడు విగ్రహాలను (జగన్నాథ్, బలభద్రుడు, సుభద్ర) రథంపై కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పహింద్(Chief Minister Bhupendra Patel Pahind) రథయాత్రను ప్రారంభించారు. ఇది 148వ రథయాత్ర కావడం గమనార్హం. యాత్ర కోసం అధికారులు 17 ఏనుగులను తీసుకొచ్చారు. ఇందులో మూడు ఏనుగులు(Elephants) అదుపు తప్పి భక్తులపై దూసుకెళ్లాయి. ఈ ఘటన ఖాడియా కూడలి సమీపంలో చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు(Devotees) స్వల్పంగా గాయపడ్డారు. అయితే పెద్దగా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

అనంతరం జూ అధికారులు వచ్చి ఏనుగులను అదుపు చేశారు. అనంతరం ఒక మగ మరియు రెండు ఆడ ఏనుగులను ఊరేగింపు నుంచి బయటకు తీసుకెళ్లారు. 14 ఏనుగులతో రథయాత్రను కొనసాగించారు. కాగా.. రథయాత్రలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Union Home Minister Amit Shah) తన కుటుంబంతో కలిసి జమల్‌పూర్ జగన్నాథ ఆలయం(Jamalpur Jagannath Temple)లో మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 8:30 గంటలకు స్వామివారు ఆలయానికి తిరిగి వస్తారు.

Exit mobile version