అక్షరటుడే, వెబ్డెస్క్:Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి(Lord Venkateswara) దర్శనం చేసుకొని తరిస్తుంటారు. ప్రస్తుతం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు(Devotees) వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
తిరుమల శ్రీవారిని బుధవారం 64,879 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,960 మంది తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీకి హుండీ ద్వారా 4.09 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ(TTD) ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఇటీవల లడ్డూ ప్రసాదం టోకెన్ల కోసం కియోస్క్ మిషన్లు(Kiosk Machines) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు.. మళ్లీ లడ్డూ ప్రసాదం టోకెన్ల కోసం బారులు తీరడానికి ఇబ్బందులు పడేవారు. దీంతో వారి సమయాన్ని ఆదా చేయడం కోసం టీటీడీ ఐదు కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఆధార్కార్డు, దర్శనం టోకెన్ నంబర్ ఎంటర్ చేసి.. యూపీఐ ద్వారా అమౌంట్ పే చేస్తే ఈ మిషన్ల నుంచి లడ్డూ ప్రసాదం టోకెన్లు వస్తాయి. వాటిని తీసుకెళ్లి ప్రసాదం కౌంటర్లలో ఇచ్చి లడ్డూలు తీసుకోవచ్చు. అంతేగాకుండా తిరుమల భక్తుల కోసం టీటీడీ ఇటీవల ఉచిత ఆర్టీసీ బస్సు(Free RTC Bus) ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.