అక్షరటుడే, ఇందూరు:Jagannath Rath Yatra | ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్(Nizamabad) నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఎనిమిది రోజులుగా నగరంలోని గాంధీ గంజ్(Gandhi Ganj)లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తెలుగు హిందీ భాషల్లో భాగవత సప్తాహం, పల్లకీ సేవ, ఊంజల్ సేవ, చప్పన్ భోగ్, అభిషేకం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇస్కాన్ ఆధ్యాత్మికవేత్త ప్రణవానంద దాస్(Pranavananda Das) హాజరై ప్రవచనాలు ఇచ్చారు. ఎనిమిది సంవత్సరాలుగా గాంధీ గంజ్లో బలరాముడు, సుభద్ర, జగన్నాథుడి విగ్రహాలతో మండపం ఏర్పాటు చేస్తున్నారు.
Jagannath Rath Yatra | రథయాత్ర కొనసాగే మార్గం
ఇస్కాన్(ISKCON) ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంకు జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) బయలుదేరుతుంది. నవీ ముంబై ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు వైష్ణవాంగ్రి సేవక్ దాస్(Vaishnawangri Sevak Das) హాజరుకానున్నారు. నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై నెహ్రూ పార్క్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ చేరుకొని తిరిగి పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, బస్టాండ్ మీదుగా గాంధీ గంజ్కు చేరుకుంటుంది.