అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీశారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి brs president jeevan Reddy మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ సర్కార్ దుర్నీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు.
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case) నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు (Former Minister KTR) ఏసీబీ నోటీసులు జారీ చేసిందని ఆయన దుయ్యబట్టారు. సర్కార్ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కాంగ్రెస్ నాయకులకు చేతకావడం లేదని విమర్శించారు. ఫార్ములా ఈ కారు రేస్ (Formula E car Race) విషయంలో కేటీఆర్పై తప్పుడు కేసులు బనాయించి గతంలోనే విచారించారని.. మళ్లీ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.