Site icon aksharatoday.in

Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్ సర్కార్ దుర్నీతిని ఎండగడతాం: జీవన్ రెడ్డి

Ex Mla Jeevan Reddy

Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్ సర్కార్ దుర్నీతిని ఎండగడతాం

అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్​కు తెరదీశారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి brs president jeevan Reddy మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ సర్కార్ దుర్నీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు.

నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case) నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్​కు (Former Minister KTR) ఏసీబీ నోటీసులు జారీ చేసిందని ఆయన దుయ్యబట్టారు. సర్కార్ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కాంగ్రెస్​ నాయకులకు చేతకావడం లేదని విమర్శించారు. ఫార్ములా ఈ కారు రేస్ (Formula E car Race) విషయంలో కేటీఆర్​పై తప్పుడు కేసులు బనాయించి గతంలోనే విచారించారని.. మళ్లీ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.

Exit mobile version