అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో (Degree Colleges) ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న స్పెషల్ కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు దోస్త్ కో-ఆర్డినేటర్ (DOST Coordinator) వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 21న దివ్యాంగులు/సీఏపీ, 22న ఎన్సీసీ/స్పోర్ట్స్/ఎక్స్ట్రా కరిక్యులమ్ ఆక్టివిటీస్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు వర్సిటీ అడ్మిషన్స్ కార్యాలయంలో సంబంధిత పత్రాలు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని సూచించారు.