అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్(Hyderabad) నగర శివారులోని దుండిగల్ విషాదం చోటు చేసుకుంది. తల్లితో కలిసి స్కూటీపై బడికి వెళ్తున్న బాలుడు టిప్పర్(Tipper) కింద పడి చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్(Dundigal Police Station) పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
ఓ తల్లి ఒకటో తరగతి చదువుతున్న తన కుమారుడిని బడిలో దింపడానికి స్కూటీపై బయలు దేరింది. దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో గల పల్లవి అంతర్జాతీయ పాఠశాల(International School) ఎదుట స్కూటీని టిప్పర్ ఢీకొంది. దీంతో బాలుడు టిప్పర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి దూరంగా పడడంతో గాయాలతో బయట పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.