Home క్రైం Hyderabad | పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

Hyderabad | పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

0
Hyderabad
Hyderabad | పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్(Hyderabad)​ నగర శివారులోని దుండిగల్​ విషాదం చోటు చేసుకుంది. తల్లితో కలిసి స్కూటీపై బడికి వెళ్తున్న బాలుడు టిప్పర్(Tipper)​ కింద పడి చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్​ పోలీస్​ స్టేషన్​(Dundigal Police Station) పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

ఓ తల్లి ఒకటో తరగతి చదువుతున్న తన కుమారుడిని బడిలో దింపడానికి స్కూటీపై బయలు దేరింది. దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో గల పల్లవి అంతర్జాతీయ పాఠశాల(International School) ఎదుట స్కూటీని టిప్పర్​ ఢీకొంది. దీంతో బాలుడు టిప్పర్​ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి దూరంగా పడడంతో గాయాలతో బయట పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version