అక్షరటుడే, వెబ్డెస్క్ : Miss World 2025 | తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు Miss World competitions ఘనంగా సాగుతున్నాయి. పోటీల్లో భాగంగా బుధవారం వివిధ దేశాల సుందరీమణులు వరంగల్ warangal వేయిస్తంభాల గుడి Thousand Pillar Temple, రామప్ప ఆలయాలను ramappa temple దర్శించుకున్నారు. ఆయా దేశాల నుంచి ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం తెలంగాణలోని పలు పర్యాటక ప్రదేశాలను చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ఒక బృందం వరంగల్ వేయి స్తంభాల గుడిని, మరో బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించింది.
Miss World 2025 | ఘన స్వాగతం
అందాల భామలకు అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ సుందరీమణులకు గిరిజన సాంప్రదాయ కొమ్ము కోయ నృత్యాలతో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరంగల్ కాకతీయ కోట వద్ద హరిత కాకతీయ హోటల్ Haritha hotel వద్ద మహిళలతో కలిసి మిస్ వరల్డ్ అభ్యర్థులు బతుకమ్మ batukamma ఆడారు. భారతీయ సాంప్రదాయ చీర కట్టులో వారు అలరించారు. మరో బృందం రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ విశిష్టతను ఆయా దేశాల అందగత్తెలు తెలుసుకున్నారు. గురువారం వీరు యాదాద్రి భువనగిరి yadadri bhuvanagiri జిల్లాలో పర్యటిస్తారు. పోచంపల్లిలో pachampally చేనేత వస్త్రాలను అందాల భామలు పరిశీలించనున్నారు.