Home తెలంగాణ RTC Strike | ఆర్టీసీ సిబ్బందితో చర్చలకు సిద్ధం.. మంత్రి కీలక ప్రకటన

RTC Strike | ఆర్టీసీ సిబ్బందితో చర్చలకు సిద్ధం.. మంత్రి కీలక ప్రకటన

0
RTC Strike | ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం.. మంత్రి కీలక ప్రకటన
RTC Strike | ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం.. మంత్రి కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Strike | తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సిబ్బంది RTC Telangana సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ మేనిఫెస్టెలో ప్రకటించిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా తమకు వేతనాలు చెల్లించాలని సిబ్బంది డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే మే 6 అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపి వేస్తామని ప్రకటించారు.

ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ minister ponnam prabhaker​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మే 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

ఇటీవల మే డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఇప్పుడిప్పుడే లాభాల్లోకి తెచ్చామని, మళ్లీ సమ్మె చేసి సంస్థను ఆగం చేయొద్దన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మంత్రితో చర్చించాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం కార్మికులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. మంత్రి ప్రకటనపై కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version