అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Strike | తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సిబ్బంది RTC Telangana సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మేనిఫెస్టెలో ప్రకటించిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా తమకు వేతనాలు చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మే 6 అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపి వేస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ minister ponnam prabhaker కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మే 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఇటీవల మే డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి cm revanth reddy మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఇప్పుడిప్పుడే లాభాల్లోకి తెచ్చామని, మళ్లీ సమ్మె చేసి సంస్థను ఆగం చేయొద్దన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మంత్రితో చర్చించాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం కార్మికులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. మంత్రి ప్రకటనపై కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాలి.