అక్షరటుడే, కామారెడ్డి : Palwancha | పిడుగు పడి ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడిన ఘటన పాల్వంచ palwancha మండలం ఫరీద్పేటలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఫరీద్పేట గ్రామానికి చెందిన మధిరే సురేష్(25) వాడి గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్నాడు. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో thunderbolt సురేష్ మృతి చెందగా మహేష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. మహేష్ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ kamareddy hospital కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.