అక్షరటుడే, ఇందూరు: మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation)లో పనిచేసే శానిటరీ ఇన్స్పెక్టర్లు(Sanitary inspectors), జవాన్లు తమ విధుల్లో అలసత్వం వహించరాదని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. ఆయన కార్యాలయంలో సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మురికి కాల్వలు శుభ్రపర్చడం, ఇంటింటి చెత్త సేకరణ, రోడ్లు శుభ్రపర్చడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. నగరవాసుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎంసీ జయకుమార్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.