అక్షరటుడే, ఇందూరు: TUCI Nizamabad | దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం(Suryam) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీలోని శ్రామిక భవన్(Shramika Bhavan)లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 11 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ, ఉపాధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, రాజేశ్వర్, లక్ష్మణ్, సాయన్న, రెహానా, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.