అక్షరటుడే, ఇందల్వాయి: NH-44 | గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి రేంజ్ పరిధిలోని చంద్రాయన్ పల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో హైవేపై బుధవారం తెల్లవారుజామున చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో చిరుత మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కళేబరాన్ని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. గత మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ చిరుత పులిని కారు ఢీకొనడంతో గాయపడిన విషయం తెలిసిందే.