More
    Homeజిల్లాలుకామారెడ్డిKaleswaram | ప్యాకేజీ 22 పనులకు మోక్షం.. ఎట్టకేలకు నిధులు మంజూరు

    Kaleswaram | ప్యాకేజీ 22 పనులకు మోక్షం.. ఎట్టకేలకు నిధులు మంజూరు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kaleswaram | ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న కాళేశ్వరం 22వ ప్యాకేజీ (package 22) పనులకు త్వరలో మోక్షం లభించనుంది. ఈ​ పనుల కోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు funds మంజూరు చేసింది. దీంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

    కామారెడ్డి kamareddy, ఎల్లారెడ్డి yellareddy నియోజకవర్గాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులు చేపట్టింది. గత మూడేళ్లుగా ఎలాంటి నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ ప్యాకేజీ పనుల కోసం రూ.23.15 కోట్లు మంజూరు చేసింది. కాలువల కోసం భూమి సేకరించిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఈ నిధులు మంజూరు చేశారు.

    Kaleswaram | మరో 3 వేల ఎకరాలు అవసరం

    కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 22 పనులు కోసం మరో మూడు వేల ఎకరాల భూమి land సేకరించాల్సి ఉంది. ప్యాకేజీ 22 కోసం ఇప్పటికే 619 మంది రైతుల నుంచి 316 ఎకరాలు సేకరించారు. తాజాగా రూ.23.15 కోట్లు విడుదల కాగా.. అధికారులు వాటిని రైతులకు అందించనున్నారు. మరో మూడు వేల ఎకరాల కోసం రూ.150 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. మిగతా పనుల కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తే పనులు పూర్తవుతాయి.

    READ ALSO  Dharani | మౌలిక వసతులు కల్పించండి: ధరణి వెంచర్​ బాధితుల డిమాండ్​

    Kaleswaram | 80 శాతం కాలువలు పూర్తి

    కాళేశ్వరం 20, 21, 22 పనుల్లో భాగంగా ఇప్పటికే కాలువల నిర్మాణం దాదాపు పూర్తయింది. మోపాల్ mopal​ మండలం కొండం చెరువు నుంచి 1.9 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ ద్వారా యాచారం సొరంగంలోకి నీళ్లు రావాల్సి ఉంది. ఇక్కడి నుంచి 133 మీటర్ల ఎత్తులో 7.67 కిలోమీటర్ల పొడవైన లింక్ కెనాల్ link canal ద్వారా భూంపల్లి bhumpalli రిజర్వాయర్, అక్కడి నుంచి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, రిడ్జి కెనాల్ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల రైతులకు నీరు అందించాల్సి ఉంది.

    Kaleswaram | రైతుల హర్షం

    భూముల పరిహారం కోసం రూ.23 కోట్లు మంజూరు చేయడంతో త్వరలో పనులు ప్రారంభం అవుతాయని రైతులు భావిస్తున్నారు. కాగా ఈ ప్యాకేజీ పనులు పూర్తయితే కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 30 వేల ఎకరాలు, బాన్సువాడ నియోజకవర్గంలో 12 వేల ఎకరాలు, రామాయంపేట మండలంలో 15 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.

    READ ALSO  Congress Kamareddy | పార్టీ మారడంతోనే ఫోన్ ట్యాప్ చేశారు..: టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ

    Latest articles

    Karnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | కర్ణాటక - కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara...

    CDC Chairman | సీడీసీ ఛైర్మన్ రాజీనామా ఉపసంహరణ.. పార్టీ నేతల బుజ్జగింపులే కారణమా..?

    అక్షరటుడే, కామారెడ్డి: CDC Chairman | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ (CDC...

    ICC New Rules | ఐసీసీ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొత్త రూల్స్ ఇవే.. స్టాప్‌ క్లాక్ రూల్ ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ICC New Rules | అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్ట్ క్రికెట్‌తో పాటు ఇతర ఫార్మాట్లకి...

    Redmi K80 Ultra | రెడ్‌మీ కే80 అల్ట్రా లాంచ్.. గేమింగ్‌, ఫొటోగ్రఫీ ప్రియులకు పర్‌ఫెక్ట్ మొబైల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Redmi K80 Ultra | రెడ్‌మీ అభిమానుల కోసం శావోమి మరోసారి సరికొత్త టాప్-ఎండ్ ఫోన్‌ను...

    More like this

    Karnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | కర్ణాటక - కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara...

    CDC Chairman | సీడీసీ ఛైర్మన్ రాజీనామా ఉపసంహరణ.. పార్టీ నేతల బుజ్జగింపులే కారణమా..?

    అక్షరటుడే, కామారెడ్డి: CDC Chairman | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ (CDC...

    ICC New Rules | ఐసీసీ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొత్త రూల్స్ ఇవే.. స్టాప్‌ క్లాక్ రూల్ ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ICC New Rules | అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్ట్ క్రికెట్‌తో పాటు ఇతర ఫార్మాట్లకి...