అక్షరటుడే, కామారెడ్డి : Kaleswaram | ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కాళేశ్వరం 22వ ప్యాకేజీ (package 22) పనులకు త్వరలో మోక్షం లభించనుంది. ఈ పనుల కోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు funds మంజూరు చేసింది. దీంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
కామారెడ్డి kamareddy, ఎల్లారెడ్డి yellareddy నియోజకవర్గాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులు చేపట్టింది. గత మూడేళ్లుగా ఎలాంటి నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ ప్యాకేజీ పనుల కోసం రూ.23.15 కోట్లు మంజూరు చేసింది. కాలువల కోసం భూమి సేకరించిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఈ నిధులు మంజూరు చేశారు.
Kaleswaram | మరో 3 వేల ఎకరాలు అవసరం
కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 22 పనులు కోసం మరో మూడు వేల ఎకరాల భూమి land సేకరించాల్సి ఉంది. ప్యాకేజీ 22 కోసం ఇప్పటికే 619 మంది రైతుల నుంచి 316 ఎకరాలు సేకరించారు. తాజాగా రూ.23.15 కోట్లు విడుదల కాగా.. అధికారులు వాటిని రైతులకు అందించనున్నారు. మరో మూడు వేల ఎకరాల కోసం రూ.150 కోట్లు అవసరం ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. మిగతా పనుల కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తే పనులు పూర్తవుతాయి.
Kaleswaram | 80 శాతం కాలువలు పూర్తి
కాళేశ్వరం 20, 21, 22 పనుల్లో భాగంగా ఇప్పటికే కాలువల నిర్మాణం దాదాపు పూర్తయింది. మోపాల్ mopal మండలం కొండం చెరువు నుంచి 1.9 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ ద్వారా యాచారం సొరంగంలోకి నీళ్లు రావాల్సి ఉంది. ఇక్కడి నుంచి 133 మీటర్ల ఎత్తులో 7.67 కిలోమీటర్ల పొడవైన లింక్ కెనాల్ link canal ద్వారా భూంపల్లి bhumpalli రిజర్వాయర్, అక్కడి నుంచి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, రిడ్జి కెనాల్ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల రైతులకు నీరు అందించాల్సి ఉంది.
Kaleswaram | రైతుల హర్షం
భూముల పరిహారం కోసం రూ.23 కోట్లు మంజూరు చేయడంతో త్వరలో పనులు ప్రారంభం అవుతాయని రైతులు భావిస్తున్నారు. కాగా ఈ ప్యాకేజీ పనులు పూర్తయితే కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 30 వేల ఎకరాలు, బాన్సువాడ నియోజకవర్గంలో 12 వేల ఎకరాలు, రామాయంపేట మండలంలో 15 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.