అక్షరటుడే, వెబ్డెస్క్: strait of hormuz | ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం (Iran-Israel War)తో పశ్చిమాసియాలో తీవ్ర అశాంతి నెలకొంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం ప్రారంభం కాగా.. రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. అయితే శనివారం రాత్రి ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని అణు శుద్ధి కేంద్రం లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అమెరికా దాడిపై ఆగ్రహంగా ఉన్న ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి (strait of hormuz ) మూసివేయాలని యోచిస్తోంది.
భారత్(Bharat), చైనా (China) సహా ఆసియా దేశాలకు నిత్యం హర్మూజ్ జల సంధి ద్వారానే చమురు సరఫరా అవుతుంది. చమురు రవాణాలో ఇది ఎంతో కీలకం. అటువంటి జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ జలసంధిని మూసివేస్తే చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు హర్మూజ్ జలసంధి మీదుగానే సరఫరా అవుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
strait of hormuz | ఎంత కీలకం అంటే..
ఇరాన్, ఒమాన్ల మధ్య ఉండే హర్మూజ్ జలసంధి పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతో కలుపుతుంది. యూరప్ దేశాల సరుకు రవాణాకు సుయెజ్ కెనాల్ ఎంత ముఖ్యమో..హర్మూజ్ జల సంధి కూడా అంతేకీలకం. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు హర్మూజ్ జల సంధి ద్వారా జరుగుతుంది. ఈ మార్గం ద్వారా నిత్యం భారత్కు 15 లక్షల బ్యారెళ్ల ముడి చమురు వస్తుంది.
భారత్, చైనాకు కీలకమైన ఈ జలసంధిని మూసి వేస్తే ఇంధన సంక్షోభం తలెత్తి రేట్లు పెరిగే అవకాశం ఉంది. మూసివేత నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై చర్యలు చేపట్టింది. ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ ఈ జలసంధి మూసివేస్తే.. దానిని మరింత పెంచాలని చూస్తోంది. అలాగే అమెరికా నుంచి కూడా ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి యోచిస్తోంది.