Site icon aksharatoday.in

Strait Of Hormuz | ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ జలసంధి మూసివేత

strait of hormuz

strait of hormuz | ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ జలసంధి మూసివేతకు ఆమోదం

అక్షరటుడే, వెబ్​డెస్క్: strait of hormuz | ఇరాన్​– ఇజ్రాయెల్​ యుద్ధం (Iran-Israel War)తో పశ్చిమాసియాలో తీవ్ర అశాంతి నెలకొంది. ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులతో యుద్ధం ప్రారంభం కాగా.. రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. అయితే శనివారం రాత్రి ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్​లోని అణు శుద్ధి కేంద్రం లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అమెరికా దాడిపై ఆగ్రహంగా ఉన్న ఇరాన్​ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్​ జలసంధి (strait of hormuz ) మూసివేయాలని యోచిస్తోంది.

భారత్(Bharat)​, చైనా (China) సహా ఆసియా దేశాలకు నిత్యం హర్మూజ్​ జల సంధి ద్వారానే చమురు సరఫరా అవుతుంది. చమురు రవాణాలో ఇది ఎంతో కీలకం. అటువంటి జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ జలసంధిని మూసివేస్తే చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు హర్మూజ్ జలసంధి మీదుగానే సరఫరా అవుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

strait of hormuz | ఎంత కీలకం అంటే..

ఇరాన్‌, ఒమాన్‌ల మధ్య ఉండే హర్మూజ్​ జలసంధి పర్షియన్‌ జలసంధిని ఒమాన్‌ జలసంధితో, అరేబియా సముద్రంతో కలుపుతుంది. యూరప్​ దేశాల సరుకు రవాణాకు సుయెజ్​ కెనాల్​ ఎంత ముఖ్యమో..హర్మూజ్​ జల సంధి కూడా అంతేకీలకం. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్‌ కెనాల్‌ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు హర్మూజ్​ జల సంధి ద్వారా జరుగుతుంది. ఈ మార్గం ద్వారా నిత్యం భారత్​కు 15 లక్షల బ్యారెళ్ల ముడి చమురు వస్తుంది.

భారత్​, చైనాకు కీలకమైన ఈ జలసంధిని మూసి వేస్తే ఇంధన సంక్షోభం తలెత్తి రేట్లు పెరిగే అవకాశం ఉంది. మూసివేత నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై చర్యలు చేపట్టింది. ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్​ ఈ జలసంధి మూసివేస్తే.. దానిని మరింత పెంచాలని చూస్తోంది. అలాగే అమెరికా నుంచి కూడా ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి యోచిస్తోంది.

Exit mobile version