Home తెలంగాణ MP Arvind | హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇందూరు గడ్డ : ఎంపీ అర్వింద్​

MP Arvind | హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇందూరు గడ్డ : ఎంపీ అర్వింద్​

0
MP Arvind | హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇందూరు గడ్డ : ఎంపీ అర్వింద్​
MP Arvind | హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇందూరు గడ్డ : ఎంపీ అర్వింద్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పునాది ఇందూరు Induru గడ్డ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ MP Arvind​ అన్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలో హిందూ రాజ్య స్థాపన ప్రారంభం అవుతుందన్నారు. జక్రాన్​పల్లి Jakranpalli మండలం మనోహరాబాద్​ గ్రామంలో పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందూరు పసుపు తయారీ పరిశ్రమను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అక్రమంగా ఉన్న పాకిస్తాన్​ వారిని రేవంత్​రెడ్డి ప్రభుత్వం వెనక్కి పంపించడం లేదన్నారు. మిగతా రాష్ట్రాల్లో పంపిస్తున్నా.. కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బోధన్‌లో దొంగ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని, బంగ్లాదేశీయులు ఉన్నారని ఆయన ఆరోపించారు.

MP Arvind | నిధులను సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం ఎఫ్​పీవోల FPO కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అర్వింద్ సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కేంద్రం భారీ రాయితీలు subsidy ఇస్తోందన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.

MP Arvind | దేశాన్ని విశ్వగురు చేస్తాం

దేశాన్ని విశ్వ గురువుగా చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గట్టి జవాబు ఇవ్వనుందని తెలిపారు. ఉగ్రవాదం అంతం చేసేలా మోదీ చర్యలు చేపట్టనున్నారని చెప్పారు. దేశం గర్వించేలా కేంద్రం ఉగ్రవాదులకు జవాబు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

MP Arvind | రేవంత్​, కవిత దోస్తులు..

సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy, ఎమ్మెల్సీ కవిత MLC Kavitha దోస్తులని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు. వారిద్దరు ఒక కంపెనీలో భాగస్వాములుగా ఉండేవారని అన్నారు. హిందువుల ఓట్లను చీల్చడమే ధ్యేయంగా కాంగ్రెస్​ congress, బీఆర్​ఎస్ brs​ పని చేశాయని విమర్శించారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ bjp విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ Dhanpal suryanarayana మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మోదీ ఆలోచన మేరకు పసుపు తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పసుపు బోర్డు ఛైర్మన్​ గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవాని శ్రీ, కోటపాటి నర్సింహనాయుడు, రైతు ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్​ తిరుపతిరెడ్డి బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Exit mobile version