అక్షరటుడే, గాంధారి: Indiramma House | మండలంలోని బ్రాహ్మణపల్లిలో (Brahmanapalli) చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల ప్రత్యేకాధికారి మురళి (Mandal Special Officer Murali) మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు (panchayat secretaries), ఉపాధిహామీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి వసతులు, నర్సరీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణ, ఏపీవో శృతి, సిబ్బంది ఉన్నారు.