అక్షరటుడే, హైదరాబాద్: Green Field Express Highway : తెలంగాణ – ఆంధ్రప్రదేశ్(Telangana, Andhra Pradesh)ను కలుపుతూ కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 365-BG ప్రారంభానికి సిద్ధం అవుతోంది. పచ్చని ప్రకృతి నడుమ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించే తరుణం ఆసన్నమైంది.
సూర్యాపేట(Suryapet) నుంచి ఖమ్మం(Khammam) చేరుకున్నాక.. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారి ప్రారంభం అవుతుంది. ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి(Devarapalli in East Godavari district) వరకు ఈ హైవే ఉంటుంది. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేను పచ్చని పొలాల మధ్య నుంచి వేస్తున్నారు. భారత్ మాల ఎకనామిక్ కారిడార్ పథకం(Bharat Mala Economic Corridor Scheme) కింద NH-365BG పేరిట ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మితమవుతోంది.
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 31 గ్రామాల్లో 19 వందల 96 ఎకరాలు సేకరించింది. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య దూరం తగ్గించేందుకు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం(Hyderabad to Visakhapatnam) వెళ్లాలంటే 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు పట్టే సుమారు 12 గంటలు. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ కొత్త మార్గం పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే నేరుగా విశాఖపట్నం వెళ్లొచ్చు. తద్వారా సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. అంటే ఏడు, ఎనిమిది గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లొచ్చు.
Green Field Express Highway : ఎనిమిది చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్స్..
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను రూ. 4,609 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇది నాలుగు లేన్లతో కూడిన రోడ్డు. 162 కి.మీ. దూరం కలిగిన రోడ్డులో కేవలం 8 చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం(Khammam), వైరా(Vaira), కల్లూరు(Kallur), సత్తుపల్లి(Sathupalli)లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తిరువూరు(Thiruvur), జంగారెడ్డిగూడెం(Jangareddygudem), గురవాయిగూడెం(Guravaigudem), దేవరపల్లి(Devarapalli) వద్ద ప్రవేశ మార్గాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో నాలుగు చోట్ల టోల్ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఉన్నాయి. 117 అండర్పాస్లు, 33 కల్వర్టులు, 9 భారీ వంతెనల మీదుగా ఈ రహదారి ప్రయాణం సాగుతుంది.
ఖమ్మం పరిధిలో తల్లంపాడు నుంచి వేంసూరు వరకు 105 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు. పనులు సుమారు 80 శాతం పూర్తయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) నాటికల్లా అందుబాటులోకి తీసుకురావాలనేది సర్కారు యోచన.