More
    HomeతెలంగాణJeedimetla | తల్లి చనిపోలేదని తెలిసి ప్రియుడిని మళ్లీ పిలిచిన కూతురు.. అంజలి హత్య కేసులో...

    Jeedimetla | తల్లి చనిపోలేదని తెలిసి ప్రియుడిని మళ్లీ పిలిచిన కూతురు.. అంజలి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jeedimetla | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ఫోన్(Smart Phone)​ ఉంది. అందరు సోషల్​ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే టీనేజీ పిల్లలు, యువత సోషల్​ మీడియా(Social Media)కు బానిసలుగా మారుతున్నారు. ఆన్​లైన్లో కొత్త స్నేహాలను వెతుక్కొని తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. ప్రేమ పేరుతో చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని జీడిమెట్ల(Jeedimetla)లో పదో తరగతి చదవుతున్న ఓ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

    హైదరాబాద్(Hyderabad) శివారులోని జీడిమెట్లలో అంజలి అనే మహిళను ఆమె కూతురు తన ప్రియుడు శివ (19), అతడి సోదరుడు యశ్వంత్(18)​తో కలిసి హత్య చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పదో తరగతి చదువుతున్న బాలిక తన తల్లిని చంపించడంతో సమాజం ఎటు పోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే తన తల్లి హత్యపై ఆమె చిన్న కుమార్తె సంచలన విషయాలు వెల్లడించింది. శివ, యశ్వంత్​ తన తల్లిపై దాడిచేశారని బాలిక చెప్పింది. చనిపోయారనుకొని వారు వెళ్లిపోయారంది. అయితే తన తల్లి చనిపోకపోవడంతో అక్క మళ్లీ తన ప్రియుడికి ఫోన్​ చేసి పిలిచిందని బాలిక ఏడుస్తూ చెప్పింది. దీంతో శివ, యశ్వంత్​ వచ్చి తన తల్లిని సుత్తితో కొట్టి చంపారని వెల్లడించింది.

    READ ALSO  Hyderabad | బంధువులతో కూల్​డ్రింక్​ తాగినందుకు వేధింపులు.. నవ వధువు ఆత్మహత్య

    Jeedimetla | అమ్మ చనిపోయింది.. లేపి వేస్ట్​

    తాను ట్యూషన్​ నుంచి వచ్చే సరికి అమ్మ రక్తపు మడుగులో పడి ఉందని చెప్పింది. అయితే అప్పటికి తన తల్లి చనిపోకపోవడంతో నిందితురాలు మళ్లీ శివకు ఫోన్​ చేసిందన్నారు. తన కళ్ల ముందే వారు తల్లిని చంపారని వాపోయింది. అంజలి దగ్గరికి వెళ్లి తాను లేపడానికి ప్రయత్నించినట్లు చిన్న కూతురు తెలిపింది. అయితే నిందితురాలు మాత్రం అమ్మ చనిపోయింది.. లేపి వేస్ట్​ అని చెప్పినట్లు సదరు బాలిక చెప్పింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు యువత ఎటువెళ్తుందనే సందేహాలు నెలకొన్నాయి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...