More
    HomeజాతీయంRailway Passengers | ఆర్వోబీ వద్ద విరిగిన క్లస్టర్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    Railway Passengers | ఆర్వోబీ వద్ద విరిగిన క్లస్టర్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | పెద్దపల్లి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్​ బ్రిడ్జి క్లస్టర్(Railway Overbridge Cluster)​ విరిగిపోయింది. అయితే అది పట్టాలపై పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ సిబ్బంది ముందుగానే గుర్తించడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు.

    పెద్దపల్లి రైల్వే జంక్షన్(Peddapalli Railway Junction)​ సమీపంలో కూనారం వద్ద ఆర్​వోబీ నిర్మిస్తున్నారు. రూ.119.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేసవి లోపు పనులు పూర్తి చేయాలని గతంలో కలెక్టర్​ ఆదేశించిన ఇంకా పూర్తి కాలేదు. అయితే ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్​ విరిగిపోయింది. ఈ క్లస్టర్ పూర్తిగా విరిగి గడ్డర్లు రైలు పట్టాలపై(Train Tracks) పడితే పెద్ద ప్రమాదం జరిగేది. అయితే ముందుగానే గుర్తించిన అధికారులు దానికి మరమ్మతులు చేస్తున్నారు.

    READ ALSO  Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    Railway Passengers | రైళ్ల రాకపోకలకు అంతరాయం

    క్లస్టర్​ మరమ్మతుల కారణంగా అధికారులు ముందు జాగ్రత్తగా పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కాజీపేట నుంచి బల్లార్షా, బల్లార్షా నుంచి కాజీపేట వైపు నడిచే రైళ్లను ఆపేశారు. దీంతో ఆయా స్టేషన్​లలో గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొలనూర్ రైల్వే స్టేషన్(Kolanur Railway Station) లో 22631 అనువ్రత్ ఏసీ సూపర్ ఫాస్ట్, పోత్కపల్లిలో 20805 పి సూపర్ ఫాస్ట్, బిసుగిరి షరీఫ్ రైల్వే స్టేషన్​లో 12621 తమిళనాడు సూపర్ ఫాస్ట్, జమ్మికుంట రైల్వే స్టేషన్​లో 12723 తెలంగాణ సూపర్ ఫాస్ట్, 22691 బెంగళూరు రాజధాని సూపర్ ఫాస్ట్, ఉప్పల్ రైల్వే స్టేషన్​లో 17011 కాగజ్ నగర్ ఇంటర్ సిటీ, హసన్ పర్తి రైల్వే స్టేషన్​లో 22648 కోర్బా బై వీక్లీ సూపర్ ఫాస్ట్, రామగుండం రైల్వే స్టేషన్​లో 20101 వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తయ్యాక ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు అనుమతించనున్నారు.

    READ ALSO  Rajasthan | ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. పోలీసులకు పట్టించిన తొమ్మిదేళ్ల కొడుకు

    సిర్పూర్ వైపు వెళ్ళే రామగిరి మెము 17003 ఎక్స్ ప్రెస్ పుష్ పుల్ రైలును ఓదెల రైల్వే స్టేషన్ లో గత 4 గంటలుగా నిలిపారు.ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

    Latest articles

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి...

    Phone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ‌లో కీల‌క అంశాలపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వ‌రం,...

    CM Convoy | సీఎం కాన్వాయ్​ కార్లలో డీజిల్​కు బదులు నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Convoy | పెట్రోల్​ బంకుల్లో(Petrol Bunks) జరిగే మోసాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం....

    More like this

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి...

    Phone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ‌లో కీల‌క అంశాలపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వ‌రం,...