అక్షరటుడే, వెబ్డెస్క్ : Train Charges Hike | రైల్వే శాఖ (Railway Department) ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ట్రెయిన్ టికెట్ల ధరలను (Ticket Price) పెంచుతున్నట్లు ప్రకటింకచింది.
ఏసీ, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ సహా సుదూర రైళ్ల ఛార్జీలను రైలే శాఖ పెంచింది. స్వల్పంగా ధరలను పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
Train Charges Hike | పెంపు ఇలా..
మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు ఒక పైస చొప్పున పెరగనుండగా.. ఏసీ కేటగిరీ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరుగుతాయి. కొత్త ఛార్జీలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కాగా.. సబర్బన్, సీజన్ రైలు టిక్కెట్ల ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు. 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి కూడా రేట్లు పెంచలేదు. 500 కి.మీ దాటితే పెరుగుదల వర్తిస్తుంది.