Site icon aksharatoday.in

Train Charges Hike | రైల్వే ప్రయాణికులకు షాక్​.. పెరిగిన టికెట్​ ధరలు

Train Charges Hike

Train Charges Hike | రైల్వే ప్రయాణికులకు షాక్​.. పెరిగిన టికెట్​ ధరలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Train Charges Hike | రైల్వే శాఖ (Railway Department) ప్రయాణికులకు షాకింగ్​ న్యూస్​ చెప్పింది. ట్రెయిన్​ టికెట్ల ధరలను (Ticket Price) పెంచుతున్నట్లు ప్రకటింకచింది.

ఏసీ, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సహా సుదూర రైళ్ల ఛార్జీలను రైలే శాఖ పెంచింది. స్వల్పంగా ధరలను పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

Train Charges Hike | పెంపు ఇలా..

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు ఒక పైస చొప్పున పెరగనుండగా.. ఏసీ కేటగిరీ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరుగుతాయి. కొత్త ఛార్జీలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కాగా.. సబర్బన్, సీజన్ రైలు టిక్కెట్ల ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు. 500 కిలోమీటర్ల వరకు సెకండ్‌ క్లాస్‌ ప్రయాణానికి కూడా రేట్లు పెంచలేదు. 500 కి.మీ దాటితే పెరుగుదల వర్తిస్తుంది.

Exit mobile version