అక్షరటుడే,ఇందూరు: Municipal Corporation | వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ (Municipal Corporation Commissioner Dilip Kumar) అధికారులకు సూచించారు. నగరానికి నీటిని సరఫరా చేసే ఫిల్టర్బెడ్ను (Filter bed) గురువారం ఆయన తనిఖీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. ఫిల్టర్బెడ్కు కావాల్సిన రసాయనాలు, ఫెర్రిక్ ఆమ్లం, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి స్వచ్ఛతను నిర్ధారించేందుకు సిబ్బంది ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని సూచించారు. కమిషనర్ వెంట ఇంజినీరింగ్ విభాగం అధికారులు, వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు.