అక్షరటుడే, కామారెడ్డి: Machareddy | టీవీఎస్ ఎక్సెల్ను బైక్ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మాచారెడ్డి మండలం చిన్న లచ్చాపేట (Chinna Lachhapet) గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న లచ్చాపేట గ్రామానికి చెందిన బూస నారాయణ తన కూతురు సులోచన, మనవళ్లు అన్వేష్, మహేష్లతో కలిసి మాచారెడ్డి నుంచి టీవీఎస్ ఎక్సెల్పై లచ్చాపేట్కు వెళ్తున్నారు.
బస్టాండు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బైక్ ఎక్సల్ వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఎక్సల్పై వెళ్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి (Kamareddy District Hospital) తరలించారు. చికిత్స పొందుతూ సులోచన(26) మృతి చెందింది. ఇద్దరు చిన్నారులకు, మృతురాలి తండ్రికి చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.