అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో లబ్ధిదారుల జాబితా ఫైనల్ కానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త చెప్పింది.
ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునే వారికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గనులు, భూగర్భ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అందించనున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి సీనరేజీ ఛార్జీలు, రవాణా భారం పడకుండా ఇసుక సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు చొప్పున ఇసుకను సరఫరా చేస్తారు.
Indiramma Houses | షరతులతో ఆందోళన
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం పలు షరతులు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులలోపు ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే సాయం అందనుంది. దీంతో చాలా మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెనకడుగు వేస్తున్నారు. ఎలాగు ఇల్లు కట్టుకుంటున్నాం, మంచిగా కట్టుకుందామని చాలా మంది భావిస్తారు. అయితే ప్రభుత్వం 600 చదరపు అడుగుల లోపు కట్టుకోవాలని చెప్పడంతో ఎంతో మంది ఈ పథకానికి దూరం కానున్నారు.