ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​YS Rajasekhar Reddy | వైఎస్​ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి

    YS Rajasekhar Reddy | వైఎస్​ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: YS Rajasekhar Reddy | మాజీ సీఎం దివంగత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి (YS Rajasekhar Reddy) ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సేవలు మరువలేనివని.. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ (Urdu Academy Chairman) తాహెర్ బిన్ హందాన్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్​ చిత్రపటానికి నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా తాహెర్​ మాట్లాడుతూ వైఎస్​ రాజశేఖర్ రెడ్డికి జిల్లాతో ఎంతో అనుబంధం ఉందన్నారు. ఒకప్పుడు ఆయన ఒక పుట్టిన రోజును నిజాంసాగర్​లో జరుపుకున్నారని గుర్తు చేశారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం(Alisagar Lift Irrigation Scheme) ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత వైఎస్​దేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నుడా(NUDA) ఛైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర ఎన్​ఎస్​యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఎస్టీసెల్​ అధ్యక్షుడు యాదగిరి, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్​మన్​ కమిటీ ఛైర్మన్​ శ్రీనివాస్, వినయ్, లవంగ ప్రమోద్, స్వామి గౌడ్, ముశ్షు పటేల్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Actress Anasuya | ఇందూరులో సందడి చేసిన అనసూయ

    YS Rajasekhar Reddy | జుక్కల్​ క్యాంప్​ కార్యాలయంలో..

    వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బిచ్కుంద: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్​ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

    YS Rajasekhar Reddy | ప్రజలతో మమేకమై..

    నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(MLA Lakshmi Kantha Rao) క్యాంప్​ ఆఫీస్​లో మంగళవారం ప్రజలను నుంచి అర్జీలను తీసుకున్నారు. వారి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారం నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో మద్నూర్​ ఏఎంసీ(Madnoor AMC) వైస్​ ఛైర్మన్​ పరమేష్​ పటేల్​, కల్లాలి రమేశ్​ దేశాయ్​ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Asi Promotions | పలువురు హెడ్​ కానిస్టేబుళ్లకు ప్రమోషన్​

    స్థానికుల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    Latest articles

    Stock Market | చివరి అరగంటలో పరుగులు.. లాభాల్లో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | అమెరికా, భారత్‌(US -Bharath) మధ్య కుదిరిన మినీ ట్రేడ్‌ డీల్‌ను ఈరోజు...

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    More like this

    Stock Market | చివరి అరగంటలో పరుగులు.. లాభాల్లో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | అమెరికా, భారత్‌(US -Bharath) మధ్య కుదిరిన మినీ ట్రేడ్‌ డీల్‌ను ఈరోజు...

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....