అక్షరటుడే, వెబ్డెస్క్ :Uttar Pradesh | ఓ యువతి తుపాకీతో హల్చల్ చేసింది. సీఎన్జీ బంక్(CNG Bunk)లో అందరు చూస్తుండగానే అందులో పని చేసే వ్యక్తిని కాల్చేస్తానని హెచ్చరించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హర్దోయి పట్టణంలో చోటు చేసుకుంది.
అరిబా ఖాన్ తన తండ్రి ఎహ్సాన్ ఖాన్, తల్లి హుస్న్బానోతో కలిసి కారులో సీఎన్జీ బంక్కు వచ్చింది. అయితే గ్యాస్ ఫిల్ చేయడానికి కారు దిగమని సేల్స్ మన్ కోరడంతో ఆమె అతడితో వాగ్వాదం చేసింది. అంతేగాకుండా ఆమె తన వద్ద అక్రమంగా ఉంచుకున్న తుపాకీ(Gun) తీసుకొచ్చి అతడి ఛాతీపై పెట్టి కాల్చివేస్తానని హెచ్చరించింది. “నేను నిన్ను చాలా దారుణంగా కాల్చివేస్తాను, నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టదు” అని సేల్స్మన్(Salesman)ను ఆమె బెదిరించింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా పోలీసులు(UP Police) అరిబా ఖాన్, ఆమె తండ్రి హుస్న్బానో , ఎహ్సాన్ ఖాన్లపై కేసు నమోదు చేశారు. రివాల్వర్ను స్వాధీనం చేసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.