అక్షరటుడే, వెబ్డెస్క్:Plane Crash | అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (Air India plane) టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే క్రాష్ అయింది. ఈ ఘటనలో విమానంతో పాటు ఎంతోమంది ఆశలు, కలలు కూడా కూలిపోయాయి. పెళ్లి తర్వాత తన భర్త దగ్గరికి తొలిసారి వెళ్తున్న ఓ యువతి విమాన ప్రమాదంలో మృతి చెందింది.
రాజస్థాన్లోని బలోత్రా(Balotra)కు చెందిన ఖుష్బు రాజ్పురోహిత్కు జనవరి 2025లో వివాహం అయింది. ఆమె భర్త లండన్లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత వారు లండన్(London city)లోనే నివాసం ఉండాలనుకున్నారు. ఆ యువతి తన భర్తతో గొప్ప జీవితాన్ని ఊహించుకుంది. అయితే పెళ్లి తర్వాత ఇక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఖుష్బు భర్త లండన్ వెళ్లిపోయాడు. ఖుష్బు ఇక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో గురువారం తన భర్త దగ్గరికి తొలిసారి వెళ్లడానికి లండన్ బయలుదేరింది.
ఖుష్బు తండ్రి వచ్చి అహ్మదాబాద్ విమానాశ్రయం(Ahmedabad Airport)లో ఆమెను దింపాడు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కిన ఆమె ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి తన కూతరుతో ఎయిర్పోర్ట్లో ఫొటో దిగాడు. ఆ చిత్రాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. లండన్ వెళ్తున్న తన కూతురిని ఆశీర్వదించాడు. అల్లుడి దగ్గరకు వెళ్లి తమకు ఫోన్ చేస్తుందనుకున్న కూతురు కొద్ది సేపటికి ప్రమాదంలో మరణించిందని తెలిసి గుండెలవిసేలా రోదించాడు ఆ తండ్రి.