అక్షరటుడే, వెబ్డెస్క్: Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే యోగా డే వేడుకలకు ప్రధాని మోదీ(Prime Minister Modi) హాజరు కానున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నది(Krishna River)లో జల యోగాసనాలు వేశారు. మూడు రోజులుగా ఆయుష్ విభాగం, శాప్ ఆధ్వర్యంలో జల యోగా కార్యక్రమం(Water yoga program) నిర్వహించారు. స్థానిక మత్స్యకారులు, చిన్నారులు, విజయవాడకు చెందిన యోగా జల అభ్యాసకులు మొత్తం 150 మంది యోగాసనాలు వేశారు. నీటిలో తేలియాడుతూ శవాసనం, ధనురాసనం వంటి వివిధ ఆసనాలు వేసి అబ్బురపరిచారు. కాగా.. ఈ ఆసనాలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్(Telugu Book of Records)లో చోటు దక్కించుకున్నాయి.