అక్షరటుడే, నిజాంసాగర్: Wrestling competitions | మండలంలోని అచ్చంపేటలో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు (Renuka Yellamma Jatara Utsavam) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కుస్తీ పోటీలు (Wrestling competitions) నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర, కర్ణాటక (Maharashtra and Karnataka) ప్రాంతాల మల్లయోధులు తరలివచ్చారు. పోటీలు తిలకించేందుకు జనాలు ఆసక్తి చూపారు. చివరి విజేతకు రూ.3వేల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు బంగ్లా ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, డాక్టర్ గోపాల్, బలరాం, రాములు, తదితరులు పాల్గొన్నారు.
