అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | భారత్లో తయారైన ఆయుధాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో మన సైనికుల సత్తా చాటామన్నారు. తక్కువ సమయంలో మన ఆర్మీ లక్ష్యాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్తో వంద శాతం లక్ష్యాలను ఛేదించామని మోదీ పేర్కొన్నారు. దీంతో మన సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. 22 నిమిషాల్లోని పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలను మట్టు బెట్టామని ఆయన వెల్లడించారు.
PM Modi | మేడిన్ ఇండియా ఆయుధాలతో..
ఆపరేషన్ సిందూర్ సమయంలో మేడిన్ ఇండియా(Made In India) ఆయుధాలను వినియోగించినట్లు ప్రధాని తెలిపారు. ఆ ఆయుధాలు వాటి సత్తాను నిరూపించుకున్నాయన్నారు. దీంతో ప్రపంచ దేశాల మన ఆయుధాల గురించి చర్చించుకుంటున్నాయని పేర్కొన్నారు. మన ఆయుధాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో(Parliament Sessions) ఆపరేషన్ సిందూర్ విజయాన్ని వేడుక చేసుకోవాలని ఆయన అన్నారు.
PM Modi | మావోయిస్టులు లేకుండా చేస్తాం
దేశంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు లేకుండా చేస్తామని మోదీ అన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు ముక్త్ భారత్ దిశగా ముందడుగు వేశామన్నారు. దేశంలో మావోయిజం దాదాపుగా అంతమైందని, అనేక ప్రాంతాలను మావోయిస్టుల చెర నుంచి బయటకు తీసుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. వందలాది జిల్లాలు నక్సల్ ఫ్రీ జోన్లు(Naxal Free Zones)గా మారాయన్నారు.
దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయన్నారు. రైతుల జీవితాలు, దేశ ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. యాక్షియం –4 మిషన్లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిని భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను మోదీ అభినందించారు. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామన్నారు.