అక్షరటుడే, నిజాంసాగర్: Mahammad Nagar | తాగునీటి ఇబ్బందులు తీర్చాలని మహిళలు రోడ్డెక్కారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వారం రోజులుగా బుడగ జంగాల కాలనీ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తూ శనివారం మహిళలు బోధన్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు.
దీంతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ (SI Shiva kumar) సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.