అక్షరటుడే, వెబ్డెస్క్: Bachupalli | నేపాల్(Nepal)కు చెందిన ఓ యువకుడు యువతిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని లగేజీ బ్యాగ్లో పెట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని బాచుపల్లి (Bachupalli)లో నిర్మానుష్య ప్రాంతంలో ఇటీవల దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఓ లగేజీ బ్యాగ్ కనిపించింది. దానిని ఓపెన్ చేసి చూడగా.. ఓ యువతి మృతదేహం ఉంది. వేరే చోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు బాచుపల్లి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడుని పట్టుకున్నారు.
నేపాల్కు చెందిన విజయ్ మే 23న అదే దేశానికి చెందిన యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో పెట్టి బాచుపల్లి – మియాపూర్ (Bachupalli – Miyapur) రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్టు పేర్కొన్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.