అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | లింగారెడ్డిపేటకు చెందిన షేక్ అహ్మద్ సాబ్ హత్య కేసును పోలీసులు చేధించారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ రవీందర్ నాయక్ yellareddy CI తెలిపారు. శుక్రవారం కేసు వివరాలు వెల్లడించారు. షేక్ అహ్మద్ భార్య పౌలవ్వకు సాతెల్లికి చెందిన కూర్మ సాయిలు మధ్య వివాహేతర సంబంధం ఉండడంతో, ఇద్దరు కలిసి షేక్ అహ్మద్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో జనవరి 24న షేక్ అహ్మద్ను పూజ పేరుతో ఎల్లారెడ్డి Yellareddy అడవిలోని గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం శరీరంపై పెట్రోల్ పోసి కాల్చారు. తరువాత అనుమానం రాకుండా భార్య పౌలవ్వ తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో భార్య పౌలవ్వ, సాయిలును నిందితులుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.