అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | చోరీ కేసులో మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు(Police) తెలిపారు. సాతెల్లి గ్రామానికి చెందిన నీరడి మంజుల ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్(Daily Market) సమీపంలో నగలు అమ్మేందుకు యత్నించగా బుధవారం పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెను విచారించగా గతంలో పలు ఇళ్లలో చోరీలు చేసినట్లు ఒప్పుకుందన్నారు. సాతెల్లి గ్రామంలోని పసుపుల అనిత ఇంట్లో, దుద్దుల దుర్గయ్య, మంగలి కిషన్ ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకొని ఒక జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, ఐదు తులాల వెండి కడియం, రూ.12,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మంజులను రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు.
