More
    HomeతెలంగాణKonda Murali | కొండా దంపతులపై చర్యలుంటాయా.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన మురళి

    Konda Murali | కొండా దంపతులపై చర్యలుంటాయా.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన మురళి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Murali | ఉమ్మడి వరంగల్​ జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ దంపతులు, మిగతా కాంగ్రెస్​ ఎమ్మెల్యే(Congress MLA)లకు మధ్య పొసగడం లేదు. వారి మధ్య కొంతకాలంగా కోల్డ్​ వారు జరుగుతుండగా ఇటీవల కొండా మురళి వ్యాఖ్యలతో అది కాస్తా బయట పడింది. దీంతో ఆయనపై కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

    Konda Murali | వివాదాస్పద వ్యాఖ్యలు

    ఇటీవల కొండా మురళి(Konda Murali) కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్​రెడ్డి(Revuri Prakash Reddy)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ఎన్నికల ముందు తన కాళ్లు పట్టుకున్నారన్నారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సైతం కడియం నల్లికుట్ల మనిషని, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి భద్రకాళి ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

    READ ALSO  National Highway 44 | హైవే పై బోల్తా పడ్డ ఆలుగడ్డ లోడ్​ లారీ: ట్రాఫిక్​కు అంతరాయం

    Konda Murali | మీనాక్షి నటరాజన్​కు ఫిర్యాదు

    కొండా దంపతుల తీరుపై ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇటీవల సమావేశం అయ్యారు. అనంతరం వారిపై కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​(Meenakshi Natarajan)కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని కమిటీ ఇదివరకే కొండా మురళికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన గాంధీభవన్​(Gandhi Bhavan)లో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యారు. మురళి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడిన కొండా మురళిపై చర్యలు తీసుకుంటారా.. మందలించి వదిలేస్తారా అనేది చూడాలి.

    Latest articles

    Rajasthan | రాజస్థాన్ లో ‘మహాభారతం’ నాటి ఆనవాళ్లు..పురావస్తు శాఖ తవ్వకాల్లో వెలుగులోకి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Rajasthan | రాజస్థాన్‌ లో మహాభారత కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. భారత పురావస్తు శాఖ...

    CP Sai Chaitanya | అమిత్​షా పర్యటన.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union...

    IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్.. నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPS officer Parag Jain | భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ ఏ...

    Police transfers | రాష్ట్రంలో 44 మంది డీఎస్పీల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Police transfers | తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ (ACPs and DSPs transfers)...

    More like this

    Rajasthan | రాజస్థాన్ లో ‘మహాభారతం’ నాటి ఆనవాళ్లు..పురావస్తు శాఖ తవ్వకాల్లో వెలుగులోకి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Rajasthan | రాజస్థాన్‌ లో మహాభారత కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. భారత పురావస్తు శాఖ...

    CP Sai Chaitanya | అమిత్​షా పర్యటన.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union...

    IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్.. నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPS officer Parag Jain | భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ ఏ...