అక్షరటుడే, వెబ్డెస్క్: Rajasthan | కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు ప్రస్తుత సమాజంలో ఎన్నో నేరాలకు పాల్పడుతున్నాయి. దేశంలో జరుగుతున్న చాలా హత్యలు, ఆత్మహత్యలకు వివాహేతర సంబంధాలే(Extramarital affairs) కారణం అవుతున్నాయి. తాజాగా ఓ మహిళ ప్రియుడి మోజులో పడి తన భర్తను హత్య చేయించింది. ఈ విషయాన్ని ఆమె తొమ్మిదేళ్ల కొడుకు పోలీసులకు చెప్పడంతో ఇప్పుడు జైలు పాలైంది.
ప్రస్తుతం వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి. దీంతో చాలా మంది ఆ బంధం మోజులో పడి కట్టుకున్న వారిని, కన్నబిడ్డలను కూడా అంతం చేస్తున్నారు. తాత్కాలిక ఆనందం కోసం ప్రాణాలు తీస్తున్నారు. అంతేగాకుండా తర్వాత పోలీసులకు చిక్కి తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు.
రాజస్థాన్లోని అల్వార్(Alwar)లో ఓ మహిళ తన భర్తను హత్య చేయించింది. ఆమె కుమారుడు చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడింది. దీంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడు పోలీసులకు(Police) అన్ని వివరాలు చెప్పాడు. బాలుడి చెప్పిన వివరాల ప్రకారం.. తన తండ్రి ఫోన్ ఛార్జింగ్ పెట్టమని చెప్పి త్వరగా పడుకున్నాడు. ఆయన పడుకోగానే తన తల్లి తలుపు తీసింది. ఆమె ప్రియుడితో పాటు మరో నలుగురు ఇంట్లోకి వచ్చారు. అనంతరం బాలుడి తండ్రిని చంపేశారు. ఆ సమయంలో తన తల్లి మౌనంగా ఉండడంపై బాలుడు ప్రశ్నించాడు. అయినా ఆమె స్పందించలేదు. ఎట్టకేలకు బాలుడు సాక్ష్యం చెప్పడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.